-: వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..
అనంతపురము, ఆగస్టు 20 : బహుజన వేదిక న్యూస్
అమరావతి, వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) - 2026పై జిల్లా కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా.. నోటీసుల జనరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. నోటీసుల డెలివరీలో ప్రస్తుతం 23 శాతం పెండింగ్ ఉందని, త్వరలోనే డెలివరీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 26 శాతం విచారణలు పూర్తయ్యాయని, మిగిలిన 74 శాతం పెండింగ్ విచారణల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఫారం-6 మరియు ఫారం-8కి సంబంధించి 10,000 కంటే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుక్ ఎ కాల్ సంబంధించి 38 పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామన్నారు. NGSP లో 8 కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు.