పామిడి ఆగస్టు 20: బహుజన వేదిక న్యూస్
స్థానిక పామిడి పట్టణంలో ఎద్దులపల్లి రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ లో జీపు యాత్ర సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దళితవాడల్లో ఉన్న ప్రదాన సమస్యలను గుర్తించి పరిష్కారానికి అధికారులు పూర్తి న్యాయంచేయాలని, ఈనెల 24వ తేదీ సోమవారంఅనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందు కేవీపీస్ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రతి గ్రామంలో దళితులకు కావలసిన స్మశాన స్థలం,ఇంటిస్థలాలు, కుల వివక్షణ గ్రామాలలో కనీసమౌలిక సదుపాయాలు నోచుకోని దళిత కాలనీలలో వీధిదీపాలు,సిసి రోడ్లు, సమస్యలపై ఉపాధి జీవనోపాధి దళిత డప్పు,ఉరుములు, కళాకారులు, చర్మకారులు,కాటికాపర్లు,పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న దళితులందరూ ఏకమై ఈనెల 24 న సోమవారం కలెక్టరేట్ ని ముట్టడిద్దామని, జిల్లావ్యాప్తంగా ఉన్న గదితులందరూ కదలి వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు . ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓ.నల్లప్ప జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,గుంతకల్ నియోజకవర్గం ఇన్చార్జి, డి శ్రీనివాసులు,గుత్తి మండల కార్యదర్శి నిర్మలమ్మ,జిల్లా కార్యవర్గ సభ్యులు రేణుకమ్మ, మండల కార్యదర్శి మల్లేష్,పామిడి మండల నాయకులు, కార్యకర్తలు దళితులు తదితరులు పాల్గొన్నారు.