
పామిడి ఆగస్టు 19: బహుజన వేదిక న్యూస్
గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ వై. వెంకటరామిరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో పామిడి మండల మైనార్టీ నాయకులు మరియు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని వై. వెంకటరామిరెడ్డి సూచించారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని అన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వై. వెంకటరామిరెడ్డితో తమకు ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రజాక్ , సలేహ,నక్క నారాయణ స్వామి,షేక్ష,కె. ఎం భాష,లాలూభాష,నూర్ బాషా,కొండపురం నారాయణ స్వామి, సి.అక్బర్, మరియు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.