గార్లదిన్నె భారత్ గ్యాస్‌లో అక్రమాలకు చెక్ పెట్టాలి

ఇంటింటి డెలివరీ చేయకుండా కల్లూరు ఆర్ఎస్ మైన్ బజార్‌లో ఒకేచోట సిలిండర్ల విక్రయం

అదనపు డబ్బులు చెల్లిస్తేనే సిలిండర్లు — ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తాం

గార్లదిన్నె ఆగష్టు 20 : బహుజన వేదిక న్యూస్ గార్లదిన్నె భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని భారతీయ భీమ్ సేన సంఘం వ్యవస్థాపకులు జై భీమ్ రామాంజినేయులు తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ సిలిండర్లు అందాల్సి ఉండగా, గార్లదిన్నె భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటింటి డెలివరీ చేయకుండా, కల్లూరు ఆర్ఎస్ మైన్ బజార్‌లో ఒకేచోట సిలిండర్లను నిల్వ చేసి విక్రయిస్తున్న పరిస్థితులు మా పరిశీలనలో బయటపడ్డాయని తెలిపారు.

అదేవిధంగా అధికారిక ధరకు అదనంగా డబ్బులు చెల్లించిన వారికి సిలిండర్లు అందించడం, సాధారణ వినియోగదారులను డెలివరీ కోసం ఇబ్బందులకు గురిచేయడం వంటి వ్యవహారాలు జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు, ఇతర ఆధారాలను అధికారులకు సమర్పించడంతో పాటు, ప్రజల దృష్టికి కూడా తీసుకువస్తామని జై భీమ్ రామాంజినేయులు పేర్కొన్నారు.

అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి

గార్లదిన్నె భారత్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన బుకింగ్ వివరాలు, డెలివరీ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, సిలిండర్ల తరలింపు వివరాలు, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

మా ప్రధాన డిమాండ్లు

గార్లదిన్నె భారత్ గ్యాస్ ఏజెన్సీపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలి.కల్లూరు ఆర్ఎస్ మైన్ బజార్‌లో సిలిండర్లు ఒకేచోట నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యవహారంపై క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించాలి ఇంటింటి డెలివరీకి సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా పరిశీలించాలి.వినియోగదారుల నుంచి అధికారిక ధరకు మించి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్న వ్యవహారంపై విచారణ జరపాలి.అక్రమ నిల్వ, మళ్లింపు లేదా బ్లాక్ మార్కెట్ విక్రయం నిర్ధారణ అయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.సాధారణ వినియోగదారులకు బుకింగ్ ప్రకారం సకాలంలో, పారదర్శకంగా సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలి.గ్యాస్ సిలిండర్లు తీసుకొస్తున్నటువంటి వాహనంలో మైక్ ఉండాలి గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాలి.విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుని, ఆ వివరాలను ప్రజలకు తెలియజేయాలి.

“ప్రజల అవసరమైన గ్యాస్‌ను బ్లాక్‌లో అమ్మితే సహించేది లేదు”గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువని, సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా పంపిణీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తే భారతీయ భీమ్ సేన తరఫున ప్రశ్నిస్తామని జై భీమ్ రామాంజినేయులు స్పష్టం చేశారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత భారత్ గ్యాస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :