థాంక్యూ సర్.. సీఎం చంద్రబాబు కి ఎమ్మెల్యే దగ్గుపాటి నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ని ప్రత్యేకంగా కలిసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

అనంతపురము అర్భన్ ఆగష్టు 20: బహుజన వేదిక న్యూస్

ఒక సామాన్య క్లస్టర్ ఇంచార్జ్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవిని ఎమ్మెల్సీగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరియు రమాదేవి దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ని ప్రత్యేకంగా కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రమాదేవితో పాటు ఆమె భర్త టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం నియోజకవర్గంలోని టిడిపి క్లస్టర్ ఇంచార్జ్, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు… ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు జిల్లాలో ప్రజా ప్రతినిధులు అందరితో కలిసి సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమాదేవికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. ఒక సామాన్య బీసీ మహిళకు ఎమ్మెల్సీ పదవి రావడం అన్నది చిన్న విషయం కాదని.. తెలుగుదేశం పార్టీతోనే ఇది సాధ్యమని అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళలకు ఎమ్మెల్సీ అవకాశం అందించడంపై స

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు నూతన ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి కచ్చితంగా న్యాయం చేస్తానని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :