
బద్వేలు, ఆగస్టు 20: బహుజన వేదిక న్యూస్ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే సాధ్యమవుతుందని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు గురువారం బద్వేల్ మున్సిపాలిటీలోని 34 వ వార్డులో ఊరుబిండి మహేశ్వర్ రెడ్డి, జయరామిరెడ్డి ల, ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయనకు వార్డులోని మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షమని అన్నారు అన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు,బద్వేలు టౌన్ నాయకులు, కొంకుల రాంబాబు , కొంకుల రామకృష్ణ , ఊరిబిండి గోపిరెడ్డి.డాక్టర్ రాజశేఖర్ మాజీ ఊరి బిండిరామకోటి రెడ్డి మున్సిపల్ చైర్మన్ పార్థసారథి. చెన్నుపల్లి సుబ్బారెడ్డి.పల్లె సుబ్బ రెడ్డి అశోక్ రాజు,సౌదరి సుబ్బారెడ్డి, మా చుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష, పామూరు బాలిరెడ్డి, వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్య, కంబాల చిన్న సుబ్బరాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









